Monday, 23 August 2021

 జైహింద్ క్విజ్ విజేత - తేజ విద్యాలయ , కోదాడ.
***************+++
             చెన్నై సిటిజన్స్ ఫోరం ఆధ్వర్యంలో 75 ఏళ్ల స్వాతంత్ర్యదినోత్సవ వజ్రోత్సవాలను పురస్కరించుకొని “ జై హింద్” పేరిట ఆగస్టు 18 న ఆన్లైన్ లో క్విజ్ నిర్వహించారు.
         సూర్యాపేట జిల్లా, కోదాడ కు చెందిన తేజ విద్యాలయ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న చేపూరి వేణుగోపాల్ విజేతగా నిలిచి 10,000/- నగదు , జ్ఞాపిక మరియు ప్రశంసా పత్రంలను కేంద్ర మత్స్య , పాడి, పశు సంరక్షణ మరియు సమాచార సాంకేతిక శాఖా సహయ మంత్రివర్యులు  యల్. మురుగన్ గారి చేతుల మీదుగా ఆగష్టు 21 న చెన్నై లో బహుమతి అందుకోవడం జరిగింది.
      ఈ క్విజ్ ను 8 నుంచి 12 వ తరగతి  పాఠశాల స్థాయి విద్యార్దులకు స్వాతంత్ర్యోద్య చరిత్ర మీద స్ఫూర్తిదాయక చైతన్యం కోసం నిర్వహించడం జరిగింది.
చిన్నారి వేణుగోపాల్ కు అభినందనలు.💐💐💐

 

No comments:

Post a Comment

  Visit to Sriharikota ISRO